Anuradha తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
అనుమతులు గురించి కాదు జై గారు. గత కొన్నేళ్ళుగా తుఫాను వస్తే తప్పించి వర్షాలు లేవు.చెరువులు, నదులు ,కాల్వలు అన్నీ ఎండిపోతున్నాయి.నీళ్ళు ఉంటేనే కదా జలరవాణా సాధ్యం !
తెలుసు నీహారిక గారు.మా ఇల్లు ఒకప్పుడు ఉన్న కెనెడీ స్కూల్ కి దగ్గరలోనే ! విజయవాడ లో కొండల పైన ఉన్న ఇళ్ళు కూడా తెలుసు.అవన్నీ అక్రమ కట్టడాలే! సికింద్రాబాద్ లో రామక్రిష్ణాపురం లో ఉన్న చెరువు ని కూడా ఆక్రమించి ఇళ్ళు కట్టుకున్నారు .వాటిని డబ్బులు కట్టి క్రమబద్దీకరించుకోమన్నారు!వాటిని కూలతొయ్యలేదు!ప్రజావేదికను కూల్చి ఏమి చెప్పదల్చుకున్నారు అంటే వాళ్ళే చెప్తున్నారు కదా, ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు ,అన్ని అక్రమ కట్టడాలను కూల్చేస్తాము అని ! అది ఎంతవరకు అమలు పరుస్తారో వేచి చూద్దాము
నీహారిక గారు, గణపతి సచ్చిదానంద ఆశ్రమం కూడా అక్కడే ఉంది అండి.చిగురు అనే అనాధ ఆశ్రమం ... ఇంకా చాలా ఉన్నాయి. నేను అంటున్నది అదే, ప్రజావేదిక కూల్చినంత ఈజీ గా మిగతా కట్టడాలు కూల్చగలరా ?నదిలో నీళ్ళు లేవని ఆశ్రమాలు, గెస్ట్ హౌస్ లు కట్టటం సరైనది కాదు కదండి.అసలు భవనాలు నిర్మించే ముందే అడ్డుకోవాలి.అది చెయ్యలేదు.ఈ వీడియో చూడండి
https://www.youtube.com/watch?v=IioDCQmF4bc
జై గారు, థాంక్యూ ! NW-4 మొదట ప్రతిపాదించిన ప్రకారం 2013 కి పూర్తవ్వాల్సింది.ఆ తర్వాత నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ 2016- NW-4 పొడవు పెంచి జూన్ 2019 కల్లా పూర్తిచెయ్యాలని నిర్ణయించారు కానీ పూర్తవలేదు.కల నిజమవుతుందో లేదా కలగానే మిగిలిపోతుందో చెప్పలేము :)