Nrahamthulla తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
లిపి లేని తుళు కన్నడ ఆశ్రయం పొందింది. ఉన్న లిపిని బాగు చేసుకోలేక తెలుగు ప్రజలు ఆంగ్ల లిపినే ఆశ్రయించారు. లిపిక్లేశాలు తెలుగుకు ప్రతి బంధకాలుగా ఉన్నాయని శ్రీ శ్రీ, వేటూరి ప్రభాకర శాస్త్రి ఆనాడే చెప్పారు.దిక్కు లేని భాషలకు ఇంగ్లేషే దిక్కు అన్నట్లు అయ్యింది ప్రపంచం. తెలుగు సాధికార భాషా సంఘాన్ని ఇప్పటికైనా ప్రారంభిస్తారా?మాదీ ఆంగ్ల ప్రదేశే అందామా?
1959 లో గాంధారి గర్వ భంగము సినిమా లొని శ్రీశ్రీ పాట తెలియజెసిన మీకు ధన్యవాదాలు🙏
https://www.facebook.com/Noor630/posts/2784444944920811
https://www.facebook.com/groups/218495668358031/posts/505835039624091
https://www.facebook.com/shajahana.begum.1/posts/2704420779667588
https://www.facebook.com/williams32143/posts/2969529369745700
https://www.facebook.com/williams32143/posts/2900414499990521
https://www.facebook.com/photo.php?fbid=2892093024156002&set=a.233025936729404&type=3&theater
Noorbasha Rahamthulla ఆహారము ఉపాధి కలుగజేసే ఇంగ్లీషును కాదని మేము అనటంలేదు.తెలుగు చచ్చిపోదని ఐరాస వాళ్ళకు చెప్పండి.నేను కోరేది తెలుగు ద్వారా ఏమన్నా ఉపాధి కల్పించే అవకాశం ఉందా అనే.
Vivek Reddy ఐరాస అనే సంస్థ ఏ కొలమానం ఆధారంగా తెలుగు చచ్చిపోతుంది అని చెప్తుంది.. పోనీ ప్రభుత్వాలు ఎలా చెప్తాయి తెలుగు బ్రతికి ఉంది అని.. వాళ్లకు చెప్పినవన్నీ నిజాలే నా సార్...ఇక తెలుగు ద్వారా ఉపాద... చెయ్యొచ్చు... తెలుగు మీడియం స్కూల్ పెట్టి చదువు చెప్పొచ్చు.. కానీ ఇప్పుడు కాదు ఇంకో వందేళ్ల తరువాత.. అప్పటికీ మనం ఉండం.. మనం లేనప్పుడు ప్రపంచం తో మనకేం పని..😜😜😜 చూస్తా ఉండాలి... మీరు రాజు కాదు నేను మంత్రి కాదు మనం అనుకున్నవి జరగడానికి🙏
Noorbasha Rahamthulla మీరు పిల్లల్ని కనండి ఉద్యోగాలిస్తాము అంటే నమ్మామా మనం?ఇవ్వలేని మాటలు జనము నమ్మరు.రాజులకు మంత్రులకు ఉపాధి ఆలోచన వస్తే మంచిదే.ఇంకా చూసే ఓపిక జనానికి లేదు🙏
Noorbasha Rahamthulla https://www.facebook.com/100021580033816/posts/511571396238857/
Vivek Reddy సార్ నేను అడిగేది మీ పిల్లలు ఎక్కడ చదివారు ఇప్పుడు ఎక్కడ చదువుతున్నారు.... ఇది నేనడిగేది.. ఎవరో ఊకదంపుడు విన్యాసాలు ఉపన్యాసాలు నా నీకెందుకు సార్.. సూటి ప్రశ్న
Vivek Reddy ఎందుకంటే మీరు తెలుగు సచ్చిపోతుంది అంటున్నారు కదా.. మీ పిల్లల స్కూల్లో తెలుగు చెప్పట్లేదా.. చెప్పనట్లయితే మీరు మీ పిల్లల్ని ఎందుకు ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నారు.. ఇది ప్రశ్న సార్
Noorbasha Rahamthulla చంపితే చచ్చిపోదా?ఉద్యోగం కోసమే అని చెప్పినా అదే ప్రశ్న .బాగు చేసే ప్లానులేమన్నా ఉన్నాయా?
Vivek Reddy ఇదే ప్రైవేట్ స్కూల్ ఇంగ్లీష్ నడిపినప్పుడు తెలుగు సచ్చిపోదు.. ఇదే ప్రైవేట్ స్కూల్లో మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొచ్చు.. పేదవాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అంటారు.. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే ఉద్యోగం కోసం.. అదే పేదవాడి పిల్లలు ఉద్యోగం కోసం ఇంగ్లీష్ మీడియం చదవొద్దు... బలే గమ్మత్తుగా ఉంది సార్ మీ వాదన....ఇంకో విషయం ఎవరు కూడ తెలుగును చంపలేదు.... మీరేదో బూచి ని చూపెట్టి అదిగో దెయ్యం అంటున్నారే కానీ.. ఒక్కసారి భయపడకుండా వెళ్లి చూసి వస్తే తెలుస్తుంది మీరు చెప్పే దెయ్యం ఉందొ లేదో..మీ పిల్లలు కు తెలుగు వస్తే మిగతా పిల్లలకు కూడా తెలుగు రాయడం చదవడం మాట్లాడ్డం అన్ని వస్తాయి...చివరకారుకు మీ పిల్లలు చదివేది ఇంగ్లీష్ మీడియం అని మీరు ఒప్పుకున్నారు.. అదే అదే ఉద్యోగం కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్..బాగు చెయ్యడానికి అసలు తెలుగు సచ్చిపోతేనే కదా...
Noorbasha Rahamthulla తెలుగులో చదివితే ఉద్యోగాలు రానప్పుడు ఏమి చెయ్యాలి?ఉద్యోగాలు వస్తే మేము తెలుగే చదివిస్తాము.తెలుగు చదువుకు ఉద్యోగాలు లేవు.ప్రభుత్వం ఇవ్వలేదు. గత్యంతరం లేకే ఇంగ్లీషు మీడియం.ఉద్యోగాలు ఇవ్వలేము ఇంగ్లీషు తప్పదు అని ప్రభుత్వమే అంటుంటే తెలుగు లో ఉద్యోగాలిచ్చి తెలుగును కూడా కాపాడండి అనటం కూడా తప్పేనా?మీ పిల్లలు చదవనప్పుడు అసలు తెలుగు ఎందుకు అంటారా?విద్యార్ధుల సంఖ్య 30 శాతానికి పడిపోతే ఆ భాష చచ్చిపోతుంది అని ఐరాస చెప్పింది. ఉద్యోగాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోకపోతే తెలుగు ఎందుకు చదవాలనే మేముకూడా అడుగుతున్నాము.
Vivek Reddy సారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. ఇప్పుడు దేశం మొత్తం మీద విదేశీ కంపెనీలు వచ్చాయి.. వారికి అర్థం అయ్యే భాషలోనే మనం పని చేసిపెట్టాలి... ఆ భాషే ఇంగ్లీష్... మీకు తెలియంది కాదు ఒక పెద్ద ఉద్యోగం నుంచి వచ్చారు.. మీరు ఉద్యోగాలు చేసేటప్పుడే ఈ కంపెనీ లు వచ్చి ఉంటాయి.. మీరు అప్పుడే ఇంగ్లీష్ కంపెనీలు వద్దు తెలుగు కంపెనీ లు మాత్రమే ఉండాలి అని మీలాంటి బ్యూరోక్రాట్స్ ఖండించి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు.. ఇంకా మాట్లాడు కోవాలి అంటే మన తెలుగు వారికి తెలివి చాలా ఎక్కువ..కానీ మనం స్వార్థం కోసం ఇంగ్లీష్ వానికి పని చేసి పెట్టి..వారు ఇప్పుడు మనమిదే ఆధారపడి నడుపుతున్నప్పుడు మనవారు కూడ డబ్బుల కోసం పనిచేశారు.. తప్పదు...అలాగని తల్లితండ్రులు కూడ ఎంత మంది బిడ్డల భవిష్యత్ మాటున అమెరికా అనే బూచి చూపించి విదేశాలకు తరుముతున్నారు... ఆ తరుణంలో తెలుగు ఉద్యోగాలు వెనుకపడి పోయాయి.ఇప్పుడు మీరు తెలుగు కావాలి అన్నగాని..నేను ఇంగ్లీష్ కావాలి అన్నగాని.. భవిష్యత్ కోసం ఇంగ్లీష్ వాడకం తప్పదు..దానిని తప్పించడం ఎవరి తరం కాదు.. కాబట్టి కాలంతో పోటీ పడి ప్రపంచంలో బ్రతకాలి అంటే ఇంగ్లీష్ తప్పదు సార్...
తెలుగు చచ్చిపోతుంది అని మీరనుకొన్నత దుస్తుతి లేదు ఇంకా చెప్పాలి అంటే 100 మంది విద్యార్థుల్లో 50 మంది మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడే ఉద్యోగాల్లో పోతారు మిగతా 50 మంది మిగులుతారు సార్.. మీరన్నటు 30%కాదు 50% జనం ఉన్నారు ..వారు తెలుగును బ్రతిస్తారు సార్.
Vivek Reddy బాగానే చెప్తున్నారు సార్...ఇంగ్లీష్ ఉంటేనే ఉద్యోగం అని మీరంటారు..మరి ఇంగ్లీష్ మీడియం లో స్కూల్ చెప్తే మీలాంటి పెద్దల బాధ ఎందుకో అర్థం కాలేదు... పోనీ తెలుగు మొత్తానికి మొత్తంగా తీసివేయ్యలేదు కదా.. సబ్జెక్ట్ చెప్తారు.. ఇంకో విషయం అందరూ విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం లో చదివినంత మాత్రాన తెలుగు రాయడం,చదవడం,మాట్లద్దాం మనేస్తారా సార్.మీరు అపోహలో పడి పది మందిని అపోహల్లోకి తోస్తున్నారు..
Noorbasha Rahamthulla అసలు తెలుగు వ్యర్ధం అనే వాళ్ళకు తెలుగు సబ్జెక్టు మాత్రం ఎందుకు?తెలుగుకూడా కావాలి అనేవాళ్లది అపోహా ?
Vivek Reddy సరే మీబోటోళ్లు అందరూ కలసి తెలుగు స్కూల్ పెట్టి మీ పిల్లల్ని అందులో చదివించడి సార్.. ఇప్పుడు పొరపాటున మీ పెద్దల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదుతుంటే మొత్తానికి మొత్తంగా బడి మాన్పించి మా బిడ్డలు తెలుగు మీడియం లో చదువుతారు అని నిరాహారదీక్ష చెయ్యండి సార్.. అప్పుడు తెలుగు బతుకుద్దో లేదో చూద్దాం.. వాటి పర్యవసానాలు కూడ చూద్దాం...సార్ పాత కాలంలో అన్ని రోగాలకు పసరు వైద్యం ఉండే.. ఇప్పుడు సైన్సు అభివృద్ధి చెంది టానిక్ గోళీలు ఆపరేషన్ లు వచ్చాయి.. అలాగే ఈ చదువుల మార్పులు కూడాను... మీరు ఏమాత్రం తెలుగు చచ్చిపోతుంది అని చింతించవద్దు... ఏమి కాదు..ఇంకో పని చెయ్యొచ్చు కదా సార్..మీతోటి మిత్రులతో కలిసి ఇదే విషయం మీద ప్రతి జిల్లాలో కొన్ని పల్లెలు తిరిగి తల్లిదండ్రుల వివరణ కోరండి తెలిసిపోతుంది కదా...🙏🙏🙏
Noorbasha Rahamthulla స్కూలుపెట్టు,నిరాహారదీక్ష చెయ్యి అని మాకు మీ సలహాలు అవసరంలేదు.మేము ఇంగ్లీషుమీడియంను వద్దు అనటంలేదు.మాకు తెలుగు మీడియం కూడా కావాలి.పసరు వైద్యం నుండి చాలా మారాము.సైన్సును అబివృద్ధిని అందరం ఆహ్వానించాలి.
Vivek Reddy మరి మీరు ఏమి సాధిస్తారు సార్.. ముఖపుస్తకంలో పోస్టులు పెడితే ప్రభుత్వాలు మీ కోరికను తిరుస్తాయ... సరే చెయ్యండి ఎంతవరకు మీరు సఫలీకృతులు అవ్వుతారో చూద్దాం..
Noorbasha Rahamthulla సాధింపులు బెదిరింపులు నా బాటకాదు.ఆలోచన ముఖ్యం.నిరాశ పనికిరాదు.చెప్పాల్సింది చెప్పాలి.మన కోరిక ప్రభుత్వమే తీర్చాలి.
Vivek Reddy ప్రజల కోరికను ప్రభుత్వాలు తీరుస్తాయి కానీ... ఎదో పది మంది అడిగితే తీర్చవ్ సార్...
Noorbasha Rahamthulla ప్రజలలో మాదీ ఒక భాగం.తీర్చేదాకా అడగుతాము.అడగకూడని కోరికా ఇది ?
Vivek Reddy సరే బాగుంది సార్.. మీ మనవళ్ళను, మనవరాళ్లను తెలుగు మీడియం లో చేర్పిస్తారా సార్... ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం లో చదుతున్నార సార్ పిల్లలు...
Noorbasha Rahamthulla తెలుగు మీడియం చదువుకు ఉద్యోగాలు ఇప్పిస్తారా?ఇప్పించమనే కోరుతున్నాం.బాగుచేసే ఆలోచన చేయండి ఎత్తివేయటం ఎందుకు? ఇష్టపడే వాళ్ళ ఆప్షన్ తీసేయవచ్చా?
https://www.facebook.com/williams32143/posts/2775561239142515
https://www.facebook.com/nrahamthulla/posts/2527722290593079
https://ia802803.us.archive.org/17/items/nrahamthulla_gmail/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8.pdf
ఉర్దూ ముస్లిముల సొంత భాషా?సాయిబు అంటే ఉర్దూనే మాట్లాడాలా?
ఈరోజు ఉదయం కృష్ణా కరకట్ట దిగువన ఉన్న రవిశంకర్ ఆశ్రమం లోజరిగే సుదర్శన క్రియకు వెళ్ళాను.అక్కడ పరిసరాలను శుభ్రం చేసే బేగం అనే ముసలమ్మ నేను సాయిబునని తెలుసుకుంది. దగ్గరకొస్తే బాగున్నావా అమ్మా అని పలకరించాను.నన్ను ఉర్దూలో మాట్లాడమంది.నాకు రాదమ్మా అన్నాను. ఆశ్చర్యపోయింది. సాయిబులకు ఉర్దూ రావాలి,రాకపోతే నేర్చుకోవాలి అంది.తప్పదా?ఎందుకని?అని అడిగాను.ఉర్దూ రాకపోతే మాసాయిబులకింద లెక్కేయ్యరు,సాయిబుల భాష ఉర్దూనే కదా? అని నన్ను ప్రశ్నించింది.
ఆలాగేం కాదమ్మా,మేము తెలుగు ముస్లిములం,మీకు ఉర్దూ ఎలానో,మాకు తెలుగు అలాగా.తమిళ ముస్లిములు,కన్నడ ముస్లిములు ఇలా ఎన్నో భాషలు ముస్లిములు మాట్లాడుతున్నారు.మన ప్రవక్త మహమ్మదు గారికి అరబ్బీ వస్తాది గానీ ఉర్దూ రాదు. ఉర్దూ మనదేశంలో మాత్రమే ఉంది అన్నాను.
ఉర్దూ ముస్లిములందరికీ మత భాష ,మాతృభాష అనే తప్పుడు అభిప్రాయం ఇప్పటికీ ఉన్నవారు తమ అభిప్రాయం మార్చుకోవాలి.
ఉర్దూ సాయిబుల భాష కాదు. ఉర్దూకు మతం రంగు పులమబడింది.వాస్తవానికి ఉర్దూ కూడా తెలుగు లాగానే భారతీయ భాష . పైగా సామాన్యుల వాడుక భాష. హిందుస్తానీ (కారి బోలీ ) భాష.ఇది భారతదేశంలో పుట్టిపెరిగి అభివృద్ధి చెందింది. 1947 వరకు మనదేశంలో రాజ భాష ఉర్దూనే.హైదరాబాద్ రాష్ట్ర హైకోర్టులో న్యాయ వ్యవహారాలు ఉర్దూలోనే జరిగేవి. న్యాయవాదులు (వకీళ్ళు)వాదనలు ఉర్దూలో చేసేవారు. తీర్పులు ఉర్దూలో వచ్చేవి. ఉర్దూలో న్యాయశాస్త్ర పుస్తకాలు ఉండేవి.రెండు హైకోర్టుల విలీనం వల్ల ఉర్దూ బెంచిని ఏడు సంవత్సరాలు నడిపిస్తామని చెప్పి మధ్యలోనే ఆపేశారు.ఉర్దూను కొందరు ముస్లిములు తమ మత భాషగా వేరుచేసి చెలామణి చేసిన ఫలితంగా ఆ భాష పట్ల వ్యతిరేకత పెరిగింది.ఉర్దూ రానివాళ్ళు ముస్లిములే కాదు అని గతంలో కొందరు ఉర్దూ ముస్లిములు తెలుగు ముస్లిములను చిన్నచూపు చూసేవారు. అయితే క్రమేణా ముస్లిముల మతగ్రంధాలన్నీ తెలుగులోకి దిగి వస్తున్నాయి.ఏ భాషకూ మతం ఉండదు.మతస్తులే ఆయా భాషలను వారి అవసరాల కోసం వాడుకుంటారు.ఉర్దూవచ్చినవాడే సాహెబు అనే స్థితినుండి ఇస్లాంను తెలుగులోకి తరలివచ్చేలా చేసిన తెలుగువాడు దూదేకుల సాహెబు.ఉర్దూ భాషరాదనే ఈసడింపులను సహించాడు.మసీదులోకి తెలుగును తీసికెళ్ళాడు.అందుకే అతను తెలుగు ముస్లిం అయ్యాడు.ఇతన్ని బాసరాని సాయిబుగా విడదీసి చూస్తారు.తెలుగు మాతృభాషగా గల దూదేకుల,నూర్ బాషా,పింజరి,లదాఫ్ మొదలైన తెలుగు ముస్లిములకు ఇస్లాం మతంలో ఎదురౌతున్న భాషాపరమైన సమస్యలపై సంస్కరణలు కోరాలి,వారు ఎదుర్కొంటున్న వివిధ సామాజిక సమస్యలను చర్చించాలి.
ఉర్దూ ముస్లిముల సొంత భాషా?సాయిబు అంటే ఉర్దూనే మాట్లాడాలా?
ఈరోజు ఉదయం కృష్ణా కరకట్ట దిగువన ఉన్న రవిశంకర్ ఆశ్రమం లోజరిగే సుదర్శన క్రియకు వెళ్ళాను.అక్కడ పరిసరాలను శుభ్రం చేసే బేగం అనే ముసలమ్మ నేను సాయిబునని తెలుసుకుంది. దగ్గరకొస్తే బాగున్నావా అమ్మా అని పలకరించాను.నన్ను ఉర్దూలో మాట్లాడమంది.నాకు రాదమ్మా అన్నాను. ఆశ్చర్యపోయింది. సాయిబులకు ఉర్దూ రావాలి,రాకపోతే నేర్చుకోవాలి అంది.తప్పదా?ఎందుకని?అని అడిగాను.ఉర్దూ రాకపోతే మాసాయిబులకింద లెక్కేయ్యరు,సాయిబుల భాష ఉర్దూనే కదా? అని నన్ను ప్రశ్నించింది.
ఆలాగేం కాదమ్మా,మేము తెలుగు ముస్లిములం,మీకు ఉర్దూ ఎలానో,మాకు తెలుగు అలాగా.తమిళ ముస్లిములు,కన్నడ ముస్లిములు ఇలా ఎన్నో భాషలు ముస్లిములు మాట్లాడుతున్నారు.మన ప్రవక్త మహమ్మదు గారికి అరబ్బీ వస్తాది గానీ ఉర్దూ రాదు. ఉర్దూ మనదేశంలో మాత్రమే ఉంది అన్నాను.
ఉర్దూ ముస్లిములందరికీ మత భాష ,మాతృభాష అనే తప్పుడు అభిప్రాయం ఇప్పటికీ ఉన్నవారు తమ అభిప్రాయం మార్చుకోవాలి.
ఉర్దూ సాయిబుల భాష కాదు. ఉర్దూకు మతం రంగు పులమబడింది.వాస్తవానికి ఉర్దూ కూడా తెలుగు లాగానే భారతీయ భాష . పైగా సామాన్యుల వాడుక భాష. హిందుస్తానీ (కారి బోలీ ) భాష.ఇది భారతదేశంలో పుట్టిపెరిగి అభివృద్ధి చెందింది. 1947 వరకు మనదేశంలో రాజ భాష ఉర్దూనే.హైదరాబాద్ రాష్ట్ర హైకోర్టులో న్యాయ వ్యవహారాలు ఉర్దూలోనే జరిగేవి. న్యాయవాదులు (వకీళ్ళు)వాదనలు ఉర్దూలో చేసేవారు. తీర్పులు ఉర్దూలో వచ్చేవి. ఉర్దూలో న్యాయశాస్త్ర పుస్తకాలు ఉండేవి.రెండు హైకోర్టుల విలీనం వల్ల ఉర్దూ బెంచిని ఏడు సంవత్సరాలు నడిపిస్తామని చెప్పి మధ్యలోనే ఆపేశారు.ఉర్దూను కొందరు ముస్లిములు తమ మత భాషగా వేరుచేసి చెలామణి చేసిన ఫలితంగా ఆ భాష పట్ల వ్యతిరేకత పెరిగింది.ఉర్దూ రానివాళ్ళు ముస్లిములే కాదు అని గతంలో కొందరు ఉర్దూ ముస్లిములు తెలుగు ముస్లిములను చిన్నచూపు చూసేవారు. అయితే క్రమేణా ముస్లిముల మతగ్రంధాలన్నీ తెలుగులోకి దిగి వస్తున్నాయి.ఏ భాషకూ మతం ఉండదు.మతస్తులే ఆయా భాషలను వారి అవసరాల కోసం వాడుకుంటారు.
https://www.facebook.com/nrahamthulla/posts/2162893720409273
https://www.facebook.com/photo.php?fbid=571562789542382&set=a.233025936729404&type=3&theater
"ఉర్దూ.. సంస్కృతం భాషలు ఒక మతానికో, ప్రాంతానికో పరిమితం కాదు. అవి భారతీయ భాషలు.స్వాతంత్య్ర పోరాటంలో హిందూ ముస్లింలు ఏకమై చేస్తున్న తిరుగుబాటును ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా బ్రిటిషు వాళ్లు 'విభజించు పాలించు' అనే విధానాన్ని అమలులో పెట్టి ఆయా వర్గాల మధ్య చిచ్చు పెట్టారు.అది నేటికీ రాజుకుంటూనే ఉంది.దేశంలో అనేక భాషలు ఉన్నప్పటికీ కాలక్రమంలో ఉర్దూ, సంస్కృతంల ఉనికికే ప్రమాదం ఏర్పడింది.ఉర్దూ అంటే ముస్లింల భాష అని, సంస్కృతం అంటే హిందువుల భాష అన్న అపోహలు ప్రజల్లో ఉన్నాయి కానీ అది వాస్తవం కాదు. మాది హిందూ కుటుంబమే అయినా ఆ రోజుల్లో మా తాతముత్తాతలు ఉర్దూలోనే చదువుకున్నారు. ఇప్పటికీ మన ప్రధాని మన్మోహన్సింగ్ కూడా తన ప్రసంగాన్ని ఉర్దూలోనే రాసుకుంటారు.మనది వ్యవసాయ ఆధారిత దేశం కావడం, పుష్కలమైన వనరులు ఉండటంతో కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్న అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ప్రాంతాల నుంచి అప్పట్లో ఎందరో బతుకుతెరువు కోసం భారత్కు వలస వచ్చారు కానీ తిరిగి వెళ్లలేదు.ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.వారంతా ఉర్దూ భాషను అక్కున చేర్చుకున్నారు."--మార్కండేయ ఖట్జూ ఈనాడు 6.4.2013