గరిమెళ్ళ సుబ్బలక్ష్మి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈ కథ ప్రారంభం చదువుతూనే ఉలిక్కిపడ్డాను. తేలిగ్గా పైపైన చదువుకుంటూ వెళ్ళిపోయే కథ కాదని వెంటనే అర్థమైపోయింది. అందుకే కథను మరింత ఏకాగ్రతతో చదవడం మొదలుపెట్టాను.
పగలు మన దృష్టికి రాని చాలా విషయాలు రాత్రి కాగానే కలత పెడుతుంటాయి. మనకి అర్థం కాని విషయాన్ని “ట” లతో చెప్పడం మానవ సహజం. అలాగే పగలు చెయ్యలేని చాలా పనులని ముసుగు తొలగించుకుని రాత్రి చేస్తామన్నది కూడా నిజం.
ఎవరో అదృశ్యవ్యక్తి రాత్రి జరిగే గొడవలన్నీ ఆపేస్తున్నాడంటే అందరికీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం కలగడం సహజం. కానీ మనలో కూడా అలా ప్రవర్తించే మనసుంటుందని మనకే తెలియని నిజం.
ఈ కథంతా ఆ అదృశ్యవ్యక్తి ఎవరోననే సందేహంతోనే నడుస్తుంది.
సార్త్రే వాక్యం, “మనం చేసిన చర్యలే మనం.” అన్న మాట ఈ ప్రశ్నకి సమాధానం చెపుతుంది.
మన చేతలే మన మనసుకు సాక్షి అన్న విషయం స్పష్టంగా ఈ కథలో తెలుస్తుంది. దానిని చెప్పడంలో రచయిత్రి విభిన్నమైన శైలిని యెంచుకున్నారు.
వర్ణనలలో వడ్లమాని మణి ఒక దృశ్యాన్నే ఆవిష్కరించారు.
ఏదైనా కథ పూర్తయాక, ఆ కథను ఎదురుగా వుంచుకుని, ఆ కథలోని లోతును తరిచి చూసినప్పుడే అందులోని నిగూడార్థం బయట పడుతుంది. ఈ కథ అలాంటిదే.
ఈ కథలో ప్రముఖ రచయిత్రి వడ్లమాని మణి చేసిన ప్రయోగం అభినందించదగ్గది.
జి.యెస్.లక్ష్మి,(గరిమెళ్ళ సుబ్బలక్ష్మి)