శ్యామలీయం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
చదివి సానుకూలంగా స్పందించి నందుకు మీకు నేనే అనేక ధన్యవాదాలు చెప్పుతున్నానండీ. <br /><br />ఇతర రామకీర్తనలను కూడా పరిశీలించి మీ ఆమూల్యాభిప్రాయాలను చెప్ప ప్రార్ధన.
ఈటైపో పుణ్యమా అని మౌనపాఠకవరేణ్యులు ఒకముక్క అన్నారు. సంతోషమండీ.
మీరు " కానీ ఇలాంటి స్నేహాలు మాత్రం కాలాన్ని జయిస్తాయి." అన్నారు. అక్షరసత్యం. నాస్నేహాలు కొన్ని నాబాల్యంలోనే మొదలై కొనసాగుతున్నాయి. నేను ఉద్యోగం చేసిన చోటల్లా మంచిస్నేహాలు ఏర్పడ్డాయి. స్కూలురోజుల వారు, ఇసీఐల్ వారు, ఓరకిల్ వారు, ఐబీయం వారు, జీటాగైల్ వారు, ఇన్నోమైండ్స్ వారు.. ఇలా ఎందరెందరో. అంతా పలుకరించుకుంటూనే ఉంటాం. వీరిలో విదేశీయులూ ఉన్నారు. ఈ 18న మాయింటికి కొందరు ఇసీఐయల్ మిత్రులు వస్తున్నారు - మాది యాభైయేళ్ళ స్నేహం. వీరిలో ఒకతను మల్లికార్జున రావు సృష్టిలో తీయనిది స్నేహమే అని ఆరోజుల్లో ఎక్కడో వ్రాసి బహుమతి పొందాడు.
"ఉద్యోగరీత్యా 1974 ప్రాంతంలో నేను హైదరాబాద్కు వచ్చినప్పుడు మేము చిక్కడపల్లి, అశోక్ నగర్, గాంధీనగర్ ప్రాంతాలలో ఉండేవాళ్లం" అన్నారు మీరు.
నేనూ 1974 లోనే ఉద్యోగరీత్యానే హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డాను. వచ్చిన కొత్తలో నేను రామ్ నగర్ గుండు వద్ద ఉండేవాడిని. దరిమిలా సీతాఫల్ మండీకి మారాను.
వామపక్షం మరియు ప్రజాతంత్రం అనేవి కలిసి ఉండే భావజాలాలు కానేకావే! వామపక్ష ప్రజాతంత్ర ఏమిటి అసందర్బం. ఇది పచ్చిమోసకారీ మాటే. ఏకమ్యూనిష్టు ప్రభుత్వమైనా ఏదేశంలోనైనా ప్రజాస్వామ్యం పాటించిందా?
ఎంటర్టైన్మెంట్ ఒక్కటే పాయింట్. ఈమాట నిజమే. కాని దాని రూపస్వభావాలు కాలానుగుణంగా మారతాయి. నాటకాలు పోయి సినిమా. రేపు సినీమా పోయి మరొకటి రావచ్చును. సినిమాను చిరంజీవి అనుకోవటం పొరపాటు కావచ్చును. ఏఐ కారణంగా సినీమా కొద్దోగొప్పో మారవచ్చును. ఏఐ పోయి మరొకటి వస్తే అది సినీమాపై మరింత ప్రభావం చూపవచ్చును. సినీమాను జనం రిసీవ్ చేసుకొనే విధానం మారుతోంది కాబట్టి సినీమా టేకింగ్ కూడా కాలానుగుణంగా మారకతప్పదు.
ఇకపోతే ఎక్కువ పెట్టుబడి లేదా ఎక్కువ స్క్రీన్స్ మీద రిలీజ్ ఐనంత మాత్రాన పెద్దసినిమా కాలేదు. జనాదరణే కొలబద్ద. కలెక్షన్ డివైడెడ్ బై ఇన్వెష్ట్మెంట్ విలువే నిజమైన సక్సైస్ ఇండెక్స్.
ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మా అన్న పాట సీనియర్ నందమూరి తారకరామారావు హీరోగా వచ్చిన "జగదేకవీరుని కథ" సినిమా లోనిది. పింగళి నాగేంద్రరావు గారి పాటకు పెండ్యాల నాగేశ్వరరావు గారు బాణీ సమకూర్చగా సుశీల, లీల ఆలపించారు. ఈపాటలో నృత్యం చేస్తూ పాడిన నటీమణులు బి.సరోజాదేవి, జయంతి, బాల, ఎల్. విజయలక్మ్మి.
గమనిక: కొద్దిరోజుల తరువాత శ్యామలీయం బ్లాగు పూర్తిగా కనుమరుగు కావచ్చును. నా వెబ్ సైటును శోధినిలో జతపరుస్తానని హామీ యివ్వలేను. కాబట్టి ఆసక్తి కలవారు https://syamalarao.in/ అనే నా కొత్త సైట్ చిరునామాను నోట్ చేసుకోగలరు.
కీర్తన చిన్నదంటే చిన్నదే అనుకోవచ్చును పల్లవి + రెండు చరణాలు మాత్రమే నిడివి కాబట్టి. ఖండగతిలో నడుస్తుంది కాబట్టి సులువుగానే శ్రుతిసుభగంగా పాడుకోవచ్చును. మీరన్నట్లు పూజావసానసమయంలో గీతం శ్రావయామి అనవచ్చును దీనితో.
<br />నేను ఈమధ్య చాలా నెలలపాటు తెలుగుబ్లాగులను వదలిపెట్టి నిజంగా చాలా చాలా హాయిగా ఉన్నాను. ఎక్కువమంది అడుగుతున్నారని నా బ్లాగును మళ్ళా పబ్లిక్ చేసి బ్లాగ్లోకం లోనికి వచ్చాను. అది చాలా పెద్దపొరపాటే అని గ్రహించాను. ఇక్కడ ఈ రాజారావు, జిలేబి అనే ఇద్దరు వ్యాఖ్యావీరులు నిత్యం అదేపనిగా నిరంతరాయంగా నామీద రాళ్ళువేస్తుంటే మిగిలిన అందరు తమతమ ఒళ్ళు కాపాడుకోవాలని దూరంగా కూర్చుని వినోదం చూస్తున్నారు మౌనంగా. ఆ
23 మార్చి, 2026 10:28 PM సమయంలో వ్యాఖ్య చేసిన అనామకు లెవరో తెలిసిపోతూనే ఉంది. అనవసరంగా బోలెడు వివరణ వ్రాసాను.
<br /><br />ఈపద్యం రెండవపంక్తిలో దోషం ఏమీలేదు. <br /><br />పద్యమ్ము <br />రసము చిప్పిల్ల వ్రాయవలయు<br />రసవిహీన మైన గులక రాళ్ళ ప్రోగు<br /><br />అని అన్వయం బహుసుభగం గానే ఉంది.<br /><br />రాజారావు గారి పద్యాలలోని గుణదోషాలను గురించి చెప్పిన మాటలు చదివి కూడా ఇలా వ్రాసారంటే ఏమనుకోవాలి? <br /><br />ఆయనకు తెలుగులో ప్రాథమికమైన పలుకుబడియైన సంధుల అవగాహనయే లేదు. ఉత్వసంధి యేదో వ్యాకరణరహస్యం ఆనుకుంటారు!
అర్ధమైన దండీ.
సర్వజ్ఞుల మని భావించుకొనే మీకు పొగడ్తలు తప్ప మరేమీ రుచించవని గ్రహించాను.
ఇక పొరపాటున కూడ తమరిని ఉద్దేశించి మాటలాడను. నిరుపయోగమైన పని చేయటం నాకూ అవసరం కాదు.
మీరూ మీ మిత్రులూ నిత్యం పరస్పరం కీర్తించుకుంటూ హాయిగా ఉండండి.
అదృష్టవంతులు మీరు. అభినందనలు. గురువుకు శిష్యులు బిడ్డలే. సందేహం లేదు. మీఆనందం అర్ధం చేసుకోగలం. పద్యాలు బాగున్నాయి.
నాపని నేను చేసుకుంటూ వెళ్ళటమే నాకర్తవ్య మండీ. <br /><br />నది ప్రవహిస్తూ వెళ్ళే క్రమంలో మైదానాలూ లోయలూ వనాలూ ముళ్ళపొదలూ మరుభూములూ పర్వతాలూ వంటివి ఎన్నెన్నో ఎదురౌతూనే ఉంటాయి. ప్రయాణం ఐతే ఆగదు కదా. కొన్ని సార్లు అడ్డంకులు తొలగిపోతాయి మరి కొన్ని సార్లు నదియే తప్పుకొని ముందుకు సాగుతుంది. <br /><br />సహజమైన దానికి విచారం లేదు. వేదన అవసరం లేదండి.